- కూకట్పల్లి నియోజకవర్గం లో సమస్యలపై దృష్టి పెట్టండి
- డ్రైనేజీ రోడ్ల సమస్యలకు నిధులు కేటాయించండి
- నియోజకవర్గంలోని పార్కులకు మెయింటినెన్స్ లేఖ ఆగమవుతున్నాయి
- చిన్నపిల్లలకు పెద్దలకు ఉపయోగపడే విధంగా ఇండోర్ స్టేడియంలో యోగా
- విద్యార్థులు పెద్దలు చదువుకోవడానికి లైబ్రరీలు ఏర్పాటు చేయాలి
- సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజనకి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వినతి
సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మర్యాద పూర్వకముగా కలిసారు. కూకట్ పల్లి నియోజకవర్గం లో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని, అలాగే కూకట్ పల్లి నల్లా చెరువు ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయడం జరిగింది కానీ చెరువు దగ్గర పలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది ఇందులో భాగంగా మహిళలకు పురుషులకు చిన్న పిల్లల పార్కు ఆట పరికరాలు వాకింగ్ ట్రాక్ యోగ ఇండోర్ స్టేడియం పార్కులో 30 బెంచీలు లైబ్రరీ మౌలిక సదుపాయాలు కల్పించాలని అలాగే రామారావు నగర్ నాలా పనులు చేపట్టడం జరిగింది ఇట్టి నాలాపై సుమారుగా 500 ఫీట్లు పనిచేయవలసిందే కావున నాలాపై స్లాబ్ ఏర్పాటుకి నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాల్సిందిగా కోరారు అలాగే మూసాపేట చౌరస్తా నుండి ఆంజనేయ నగర్ వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని మరియు బాలనగర్ గత కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజలకు ఉపయోగపడుతున్న రాజు కాలనీ కమ్యూనిటీ హాలు ఈఎస్ఐ డిస్పెన్సరీగా కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అని, స్థానిక పేదల అవసరాల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాలు ను ఈఎస్ఐ కి అప్పగించారు అన్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తెలిపారు ప్రజలకు ఉపయోగపడే కమ్యూనిటీ హాల్ను యధావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం మాజీ కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి, తూము శ్రావణ్ కుమార్, పగడాల బాబురావు, పండాల సతీష్, మందాడి శ్రీనివాస రావు , సబిహా గౌసుద్దీన్, మాధవరం రంగారావు తదితరులు పాల్గొన్నారు

