- 18వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కమ్యూనిటీ ఆర్గనైజర్ మురళి
- రెండు లక్షల రూపాయలు సంఘానికి ఇప్పిస్తే 10% ఇవ్వాలని డిమాండ్
- ఏసీబీ కార్యాలయాన్ని ఆశ్రయించి సమాచారం ఇచ్చిన మహిళలు
కూకట్ పల్లి జోనల్ కార్యాలయంలోనీ మూసా పేట్ సర్కిల్లో కమ్యూనిటీ ఆర్గనైజర్ గా పనిచేస్తున్న మురళి అనే ఉద్యోగి మహిళ దగ్గర నుండి 18 వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడని రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డిఎస్పి ఆనంద తెలిపారు. వాయిస్ ఓవర్: కూకట్ పల్లి జోనల్ కార్యాలయంలోని మూసాపేట్ సర్కిల్ మూసాపేట డివిజన్లో సీవోగా పనిచేస్తున్న మురళి డ్వాక్రా మహిళా గ్రూప్ సంఘాలను ఆర్గనైజింగ్ నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి మహిళలకు వచ్చే సంక్షేమ నిధులు డ్వాక్రా నిధులు సంఘ సభ్యులకు పంపిణీ చేసే క్రమంలో మహిళా సంఘానికి రెండు లక్షల రూపాయలు ఇప్పిస్తే 10% లంచం కావాలని చెప్పడంతో రెండు లక్షలు ఇప్పిస్తే ఫైనల్ గా 18 వేల ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారని తెలిపారు. అందులో భాగంగానే మూసాపేట్ సర్కిల్ కార్యాలయంలో కమ్యూనిటీ ఆర్గనైజర్ మురళి పై రైడ్ చేసి మురళి వద్ద నుండి 18 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని గత కొంతకాలంగా కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ లో విధులు నిర్వహించిన మురళి అక్రమంగా ఎంత సంపాదించాడో వివరాలను సేకరించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏసీబీ డిఎస్పి ఆనంద్ తెలిపారు
