- నల్లచెరువు ప్రారంభోత్సవానికి సీఎం
- స్వాగతం పలికిన బొట్టు విష్ణు
- జగన్ వ్యాఖ్యలతో సంబంధం లేదు

కూకట్ పల్లి : “నిన్న జగన్ మోహన్ చేసిన వ్యాఖ్యలతో మాకు, మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం” అని కూకట్పల్లి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొట్టు విష్ణు స్పష్టం చేశారు.నల్లచెరువు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన స్వాగతం పలికారు. సీఎం పర్యటన సందర్భంగా బొట్టు విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆ మాటలు ఆయన వ్యక్తిగతమని కొట్టిపారేశారు.
