కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసింది తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిందీ కేసీఆర్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాల్లో పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించారని తెలిపారు.అదేవిధంగా మహిళలకు చేయూతగా కుట్టుమిషన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మహిళల పేరుమీదే పంపిణీ చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మహిళల 33 శాతం రిజర్వేషన్ను వచ్చే ఎన్నికల్లో అమలు చేయాలని ఎమ్మెల్యే కృష్ణారావు డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు.
