పటాన్చెరువు నియోజకవర్గంలోని బొల్లారం ఇండస్ట్రీ ఏరియాలో ఉన్న విజయవాడ–అమరావతి కాంక్రీట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రెడీమిక్స్ కంపెనీలో పనిచేస్తున్న డ్రైవర్లు ప్రశాంత్, తాహిర్, అన్సారీకి రావలసిన డిసెంబర్ నెల వేతనాలు ఇవ్వకుండా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం చేసినట్లు తెలిసింది.ఈ విషయం తెలుసుకున్న బిఆర్టియు రాష్ట్ర కార్మిక నాయకుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి కంపెనీ యజమాని రామచందర్తో మాట్లాడి డ్రైవర్లకు ఒక్కొక్కరికి ₹16,000 చొప్పున మొత్తం ₹48,000 బకాయి వేతనాలు ఇప్పించారు.దీనిపై డ్రైవర్లు రవికి తమ తరఫున మరియు కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
