
కుత్బుల్లాపూర్: ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు.దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోని శంభీపూర్లో ఉన్న కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ.. ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.అనంతరం పలువురు నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతాల్లో జరగనున్న వివిధ శుభకార్యక్రమాలకు హాజరు కావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును ఆహ్వానించారు.

