జగద్గిరిగుట్ట: విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి చాక్లెట్లు సరఫరా చేస్తున్న 50 ఏళ్ల మహిళను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని మహదేవ్పూర్ గణేష్ టెంపుల్ వద్ద ఎస్ఓటీ పోలీసులు మెరుపుదాడి చేసి జ్యోతి(50)ను అదుపులోకి తీసుకున్నారు.ఆమె వద్ద సుమారు 23 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి విద్యార్థులకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు.జ్యోతితో పాటు మహదేవ్పూర్కు చెందిన మరో ముగ్గురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్కు అప్పగించారు.

