జనగాం జిల్లా కేంద్రం లో కాటమయ్య రక్షణ కవచం పథకం కార్యక్రమం లో భాగంగా ఎంపీ శ్రీ చామల. కిరణ్ కుమార్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగపురి. కిరణ్ కుమార్ గౌడ్.
ఈ పథకం లో భాగంగా 419 మంది గీత కార్మికులకు రక్షణ కిట్స్ లను ఎంపీ చామల. కిరణ్ కుమార్ రెడ్డి గారు అందజేయడం జరిగింది. ఎంపీ గారు మాట్లాడుతూ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు గీత కార్మికల సమస్యలపై సానుకూల దృక్పథం తో ఉన్నారు అని అలాగే ఈ రక్షణ కిట్స్ ను గీత కార్మికలు విధిగా ఉపయోగించాలని గీతన్న లకు సూచన చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగపురి .కిరణ్ కుమార్ గౌడ్ గారు గీత కార్మికల కుటుంబసభ్యులకు ఈ రక్షణ కిట్స్ యొక్క ఉపయోగాల గూర్చి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసే విధంగా అధికారులు చొరవ తీసుోవాలని ఎంపీ చామల. కిరణ్ కుమార్ రెడ్డి గారి దృష్టి కి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి ఆ దిశగా కార్యక్రమాలు చేయాలని ఎంపీ గారు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో గీత కార్మికులు పాల్గొన్నారు
