కూకట్పల్లి: బోరబండకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఇస్మాయిల్ గోకుల్ ప్లాట్స్లో పనులు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సికింద్రాబాద్లోని విజయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బీఆర్టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి ఆస్పత్రికి వెళ్లి ఇస్మాయిల్ను పరామర్శించారు.అనంతరం కాంట్రాక్టర్, భవన యజమానితో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఇప్పటివరకు కాంట్రాక్టర్ రూ.2.50 లక్షలు, భవన యజమాని రూ.1.80 లక్షలు అందించినట్లు తెలిపారు.కార్మికులకు ఎలాంటి అన్యాయం జరిగినా అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాడుతానని రవి అన్నారు. బాధిత కుటుంబ సభ్యులు రవికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంతోష్ గౌడ్, జగన్, సుదర్శన్, కిరణ్ పాల్గొన్నారు.

