
బాలానగర్,: బాలానగర్ డివిజన్ పరిధిలోని వినాయక్నగర్ గడ్డిచేను సర్కిల్ వద్ద భారీ వాహనాల రాకపోకల కారణంగా టర్నింగ్ ప్రాంతంలో ఉన్న సిమెంట్ మ్యాన్హోల్ కవర్లు తరచూ దెబ్బతింటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.సమస్యను గుర్తించిన బాలానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి అధికారులతో మాట్లాడి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో మ్యాన్హోల్ కవర్లు దెబ్బతినకుండా నూతనంగా ఐరన్ క్యాచ్ పిట్ ఏర్పాటు చేయించారు.ప్రజల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ఎల్లప్పుడూ ముందుంటామని ఆవుల రవీందర్ రెడ్డి తెలిపారు.
